ఆలూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు..!
By - TV5 Digital Team |18 March 2021 4:15 PM GMT
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి జయారం ఎదుటే గొడవకు దిగారు వైసీపీ నేతలు.
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి జయారం ఎదుటే గొడవకు దిగారు వైసీపీ నేతలు. హాలహర్వి మండలం పచ్చర్లపల్లిలో వైసీపీ నేత రాఘవేంద్రరెడ్డి ఇంటికి వెళ్లారు మంత్రి జయరాం. ఈ సందర్భంగా... పంచాయతీ ఎన్నికల్లో అంటీముట్టనట్లు వ్యవహరించడం వల్లే ఓడిపోయామని గొడవకు దిగారు నేతలు. మంత్రి ఎదుటే గొడవకు దిగి ఒకరినొకరు దూషించుకున్నారు వైసీపీ నేతలు హనుమంతరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, రామిరెడ్డి. వీరిని ఇంట్లో తీసుకెళ్లి నచ్చచెప్పి గొడవను సద్దుమణిచారు మంత్రి జయరాం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com