ఏపీలో తగ్గని కరోనా ఉధృతి

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తునే ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 75 వేల 13 నమూనాలను పరీక్షించగా 8 వేల 835 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5 లక్షల 92 వేల 760 కి చేరింది. 24 గంటల వ్యవధిలో 10 వేల 845 మంది కోలుకోగా.. 64 మంది మృతిచెందారు.
కొత్తగా చిత్తూరు జిల్లాలో 9 మంది, నెల్లూరు 7, గుంటూరు 6, ప్రకాశం జిల్లాలో ఆరుగురు, అనంతపురంలో ఐదుగురు మృతి చెందగా.. కడపలో 5, కృష్ణాలో నాలుగు, తూర్పుగోదావరి జిల్లాలో 3, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 5 వేల 105కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 90 వేల 279 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 4 లక్షల 97 వేల 376 మంది డిశ్చార్జ్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com