ఏపీలో శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు..!

X
By - TV5 Digital Team |24 March 2021 5:00 PM IST
ఏపీలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 585 కేసులు నమోదుకాగా... నలుగురు మృత్యువాత పడ్డారు.
ఏపీలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 585 కేసులు నమోదుకాగా... నలుగురు మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 128 పాజిటివ్ కేసులు రాగా... చిత్తూరు, కర్నూలు, గుంటూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,95,121కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,946 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com