Crime: కల్లూరులో డబుల్‌ మర్డర్‌

Crime: కల్లూరులో డబుల్‌ మర్డర్‌
కత్తులతో వధువు కుటుంబంపై దాడి చేసిన భర్త, మామ

కర్నూలు జిల్లా కల్లూరులో జంట హత్యలు కలకలం రేపాయి. నవ వధువు రుక్మిణి దారుణ హత్యకు గురైంది. భార్య కుటుంబంపై భర్త శ్రవన్‌, మామ కత్తులతో దాడి చేసి హత్యచేశారు. ఈ దారుణ ఘటనలో రుక్మిణితో పాటు ఆమె తల్లి రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. మృతుల స్వస్థలం తెలంగాణలోని వనపర్తి జిల్లాగా గుర్తించారు. అయితే వీరికి రెండు వారల క్రితమే వివాహం జరిగింది. హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story