Crime: కల్లూరులో డబుల్ మర్డర్
By - Subba Reddy |14 March 2023 11:30 AM GMT
కత్తులతో వధువు కుటుంబంపై దాడి చేసిన భర్త, మామ
కర్నూలు జిల్లా కల్లూరులో జంట హత్యలు కలకలం రేపాయి. నవ వధువు రుక్మిణి దారుణ హత్యకు గురైంది. భార్య కుటుంబంపై భర్త శ్రవన్, మామ కత్తులతో దాడి చేసి హత్యచేశారు. ఈ దారుణ ఘటనలో రుక్మిణితో పాటు ఆమె తల్లి రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. మృతుల స్వస్థలం తెలంగాణలోని వనపర్తి జిల్లాగా గుర్తించారు. అయితే వీరికి రెండు వారల క్రితమే వివాహం జరిగింది. హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com