Konaseema : కోనసీమపై వాయుగుండం ప్రభావం.. ముందుకొచ్చిన సముద్రం

X
By - Manikanta |17 Oct 2024 1:30 PM IST
అంబేద్కర్ కోనసీమ జిల్లాపై వాయుగుండం ప్రభావం తీవ్రంగా పడింది. తీరం వెంబడి మలికిపురం మండలం గొల్లపాలెం నుండి సఖినేటిపల్లి అంతర్వేది తీర ప్రాంతంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సుమారు 500 మీటర్ల వరకూ సముద్రం ముందుకొచ్చింది. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. సముద్రాన్ని అనుకుని ఉన్న ఆక్వా చెరువులు మునిగిపోయాయి. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com