AP : ఏపీ రైతు బజార్లలో తక్కువ ధరకు నిత్యావసర సరుకులు

X
By - Manikanta |1 Aug 2024 12:04 PM IST
రాష్ట్రంలో నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో సారి తగ్గించాలని నిర్ణయించామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతు బజార్లలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కందిపప్పు కిలో రూ.160 నుంచి రూ.150కి, బియ్యం రూ.48 నుంచి రూ.46, స్టీమ్ బియ్యం రూ.49 నుంచి రూ.47కీ తగ్గించామని ఆయన వివరించారు.
గురువారం నుంచి తగ్గింపు ధరల్లో వాటిని విక్రయిస్తారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ నెల రోజుల వ్యవధిలో బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని మంత్రి మనోహర్ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com