chandrababu Naidu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..!

chandrababu Naidu : ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..!
chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డిజిపికి లేఖ రాశారు. కర్నూలు టీడీపీ నేత జనార్దన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు లేఖలో తెలిపారు.

chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. కర్నూలు టీడీపీ నేత జనార్దన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు లేఖలో తెలిపారు. జనార్దన్ రెడ్డి ,టీడీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు. భవిష్యత్తులో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు. టీడీపీ నాయకుల పై తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు ఉన్నది దొంగలుకు రక్షణ కల్పించడానికేనా అని ప్రశ్నించారు. ప్రజలు కరోనా, బ్లాక్ ఫంగస్ లతో చనిపోతుంటే.. వైసీపీ రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. జనార్దన్ రెడ్డి, టీడీపీ నేతల పై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని చంద్రబాబు తెలిపారు. అంతకుముందు కర్నూలు తెలుగుదేశం నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.


Tags

Read MoreRead Less
Next Story