రాష్ట్రంలో ఉన్మాద పాలన చూస్తున్నాం : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్మాద పాలన చూస్తున్నాం : చంద్రబాబు
ఎప్పుడు చూడని ఉన్మాద పాలన రాష్ట్రంలో చూస్తున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో... ఏ విధ్వంసం సృష్టిస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు..

ఎప్పుడు చూడని ఉన్మాద పాలన రాష్ట్రంలో చూస్తున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో... ఏ విధ్వంసం సృష్టిస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. నర్సాపురం పార్లమెంట్ నియోజవర్గంపై బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని బాబు ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం, పాత పథకాలకే కొత్తపేర్లు పెట్టడం వంటి తుగ్లక్ పాలనతో రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారన్నారు.

Tags

Read MoreRead Less
Next Story