తొడగొట్టి మీసం మెలేసిన యరపతినేని శ్రీనివాసరావు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీసం మెలేసి తొడగొట్టారు. టీడీపీ కార్యకర్తలపై ఎవరైనా దాడులు చేస్తే పల్నాడు బొబ్బిలిలా తమ దెబ్బ రుచి చూపిస్తామని అధికార పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. దీంతో నడికుడి వేదికగా జరిగిన బహిరంగ సభ టీడీపీ కేడర్లో ఉత్సాహాన్ని నింపింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్షనిజం పెరిగిందని ఇకపై అరాచకాలను క్షమించేది లేదన్నారు.
నిజంగా పల్నాడు మీదు ప్రేమ ఉంటే గురజాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాస్త మహేష్ రెడ్డికి సవాల్ విసిరారు యరపతి నేని. పోలీసులను అడ్డంపెట్టుకొని హత్యలు, అత్యాచారాలు చేసే వారికి ప్రభుత్వం కొమ్ముకాయడం దారుణమన్నారు. పల్నాడులో పుట్టాను.. టీడీపీ కార్యకర్తల కోసమే తాను పని చేస్తానంటూ కేడర్ లో ఉత్సాహం నింపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com