Anantapur: అనంతపురంలో ఆవుకు సీమంతం.. చీర, పూలు, పిండి పదార్ధాలతో ఘనంగా..

Anantapur: అనంతపురంలో ఆవుకు సీమంతం.. చీర, పూలు, పిండి పదార్ధాలతో ఘనంగా..
Anantapur: సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో పాడి ఆవుకు సీమంతం నిర్వహించి మురిసిపోయాడో రైతు.

Anantapur: సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో పాడి ఆవుకు సీమంతం నిర్వహించి మురిసిపోయాడో రైతు. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం మీర్జాపురం పంచాయతీలోని బంగారు చెన్నేపల్లిలో రైతులు దంపతులు శంకర్‌రెడ్డి, సరస్వతి ఏడాది క్రితం ఆవును కొనుగోలు చేశారు. కన్నబిడ్డలా పెంచుకుంటున్నారు. ఆ ఆవు గర్భం దాల్చడంతో సీమంతం నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామంలోని మహిళలను కార్యక్రమానికి ఆహ్వానించారు. కొత్త చీర, పూలు, పిండి పదార్థాలు తీసుకొచ్చి ఘనంగా సీమంతం నిర్వహించారు. పలువురు మహిళలు సీమంతం పాటలు పాడుతూ వేడుకలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story