పవన్కళ్యాణ్ను కించపరుస్తూ ఫ్లెక్సీలు

X
By - Subba Reddy |29 May 2023 6:45 PM IST
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ప్లెక్సీలు కలకలం రేపాయి. పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ప్లెక్సీలు కలకలం రేపాయి. పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జనసేన నేతలు మండిపడుతున్నారు. ఇది కచ్చితంగా వైసీపీ నాయకులు వేయించన పోస్టర్ అంటూ ఆమదాలవలస నియోజకవర్గ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్లను పవన్ కల్యాణ్ పల్లకిలో మోస్తున్నట్లు వైసీపీ నేతలు చిత్రీకరించారంటూ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్లెక్సీలను చించేందుకు వెల్లిన జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు జనసేన నేతలకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం జనసేన నేతలను కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com