Jogi Rajeev: ఏసీబీ అదుపులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో రాజీవ్ ఏ2గా ఉన్నట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్.. అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని జోగి రాజీవ్ చెప్పారు.
మరోవైపు అగ్రి గోల్డ్ భూములు ఆల్రెడీ అటాచ్లో ఉన్నాయని, అటాచ్మెంట్లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ నిలదీశారు. తప్పు చేస్తే ఉరేసుకుంటానని జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు.
సీఐడీ నమోదు చేసిన కేసులోనే ఏసీబీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. దీనిలో ఏ1గా రాజీవ్, ఏ2గా జోగి రమేశ్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. వీరిపై ఐపీసీ 420, 409, 467, 471, 120(బి) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అనంతరం రాజీవ్ను అదుపులోకి తీసుకుని గొల్లపూడి కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన్ను విచారిస్తున్నారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి వివరాలు..
జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహనరంగదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేశ్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్కుమార్, విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు,
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com