వైసీపీపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు
By - kasi |16 Nov 2020 2:56 PM GMT
వైసీపీపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. శిరోముండనం పుట్టింది రామచంద్రపురం నియోజకవర్గంలోనే అన్న ఆయన.. దోషులెవరో ముఖ్యమంత్రికి తెలుసన్నారు.. శిరోముండనం చేసిన వ్యక్తికి రెండు పదవులు కట్టబెట్టారంటూ ఆరోపణలు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎస్సీలకు చెందాల్సిన ఫలాలను తమ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com