Guntur: అదుపుతప్పి చెరువులో పడిన కారు.. నలుగురు మృతి..
By - Divya Reddy |18 Jan 2022 6:15 AM GMT
Guntur: కారు అదుపు తప్పి చెరువులో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ చనిపోయారు.
Guntur: గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి చెరువులో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ చనిపోయారు. మంగళగిరి మండలం యర్రబాలెంలో ఈ ప్రమాదం జరిగింది. కృష్ణాయపాలెం నుంచి వస్తున్న కారు యర్రబాలెం చెరువు వద్దకు వచ్చే సరికి అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో కొండవీటి వెంకటేశ్వర్లు, నారాయణ రావు, సురేష్, తేజ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన నలుగురిలో ముగ్గురు యువకులు మంగళగిరి ప్రాంతానికి చెందిన వారు కాగా, ఒకరు యర్రబాలెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com