ఆ విషయంలో పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకొని బీజేపీని ఒప్పించాలి : గంటా
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నిర్లక్ష్యమైన ప్రకటనలు చేయడం ఎవరిని మభ్యపెట్టేందుకని మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు ఫైర్ అయ్యారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నిర్లక్ష్యమైన ప్రకటనలు చేయడం ఎవరిని మభ్యపెట్టేందుకని మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ప్రైవేటీకరించే ఆలోచన తమకు లేదని బీజేపీ ఎందుకు స్పష్టత ఇవ్వలేక పోతుందని ఆయన నిలదీశారు. నీతిఅయోగ్ డైరెక్షన్ ప్రకారమే ప్రైవేటీకరిస్తున్నట్లు మినిస్టర్ ఠాకూర్ ఒకవైపు చెపుతుంటే.. బీజేపీవాళ్లు ఎందుకు మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీని ఒప్పించే బాధ్యత తీసుకోవాలన్నారు.
Next Story