Ramya Murder Case : రమ్య హత్య కేసు.. నిందితుడికి ఉరిశిక్ష..!

Ramya Murder Case : రమ్య హత్య కేసు.. నిందితుడికి ఉరిశిక్ష..!
Ramya Murder Case : ఏపీలో గుంటూరుకి చెందిన బీటెక్ విద్యార్దిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది.. నిందితుడు శశికృష్ణకి ఉరిశిక్ష విధించింది.

Ramya Murder Case : గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో ఫాస్ట్రక్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు శిశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ... జడ్జిమెంట్‌ ఇచ్చింది. గతేడాది గుంటూరు పరమాయికుంటకు చెందిన రమ్యను... శిశికృష్ణ కత్తితో పొడిచి హత్య చేశాడు. తనను ప్రేమించడం లేదని... ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ కేసుపై దాదాపు 5 నెలలు విచారించిన ప్రత్యేక న్యాయం స్థానం... నిందితుడికి ఉరిశిక్ష వేస్తూ తీర్పునిచ్చింది.

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. నిందితుడు శశికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు మొత్తం 36 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు.. 15రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. హత్య ఘటనపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28మందిని విచారించారు.. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు.

హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని ఈనెల 26న విచారణ పూర్తి చేసింది. ఇవాళ తీర్పును వెలువరించారు. 36 మంది సాక్షుల వాగ్మూలాన్ని పరిశీలించ కోర్టు నిందితుడికి ఉరి శిక్ష ఖరారు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story