Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.70 అడుగుల వరకు నీరు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.96 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం జలాశయానికి 2,02,456 క్యూసెక్కుల ఇన్ ఫ్లో (నీరు వచ్చి చేరడం) కొనసాగుతోంది. జలాశయానికి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో, దిగువకు నీటిని విడుదల చేయడానికి అధికారులు 4 స్పిల్ వే గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం గేట్ల ద్వారా 1,08,076 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి కూడా భారీగా వరద నీరు శ్రీశైలానికి చేరుతోంది. ఈ ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు..
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com