Weather Report : తెలుగురాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు

Weather Report : నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే ముందే అండమాన్ తీరాన్ని తాకాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది. రుతుపవనాల ప్రభావంతో కేరళ, దక్షిణ కర్ణాటకలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడు..తెలంగాణ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఇవాళ దక్షిణ బంగాళాఖాతం మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఏపీలో ఉత్తర, దక్షిణ కోస్తాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు తెలంగాణలోనూ అక్కడకక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com