AP: టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ కుమారుడి వివాహంలో వీరంగం సృష్టించారు. వివాహ వేడుకలను డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్న ఆపరేటర్పై దాడికి పాల్పడ్డారు. పైజ్ కుమారుడి వివాహంలో కెమరామెన్లు డ్రోన్లతో షూట్ చేస్తున్న సందర్భంగా మంత్రి కాంపౌండ్ లోకి డ్రోన్ వెళ్ళిందని వారిపై దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. శివనంది నగర్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలో వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ నివాసం ఉంది. అబ్దుల్ ఫయాజ్ కుమారుడి పెళ్లి నేపథ్యంలో డ్రోన్ సాయంతో షూట్ చేస్తున్నారు. మంత్రి నివాసంపై డ్రోన్ కెమెరా ఎగరడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. మంత్రి ఇంటిని షూట్ చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు స్పందించారు. టీడీపీ కార్యకర్తలు డ్రోన్ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అబ్దుల్ ఫైజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ వర్గీయుల దాడికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని పీఎస్ ముందు ధర్నాకు సిద్ధమయ్యారు.
బనగానపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
నంద్యాల జిల్లా బనగానపల్లె పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమ కుటుంబంపై మంత్రి అనుచరులు దాడి చేశారని దాడివైసీపీ నాయకుడు అబ్దుల్ పైజ్ ఆరోపించాడు. మరో పక్క మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటిపై డ్రోన్ కెమెరాలతో వీడియో తీశారని మంత్రి అనుచరులు ఆరోపించారు. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణ పడటంతో పట్టణంలో భయాందోళన నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com