Eluru: వైద్యుల నిర్లక్ష్యంతో నెల రోజుల బాలుడు మృతి

Eluru: వైద్యుల నిర్లక్ష్యంతో నెల రోజుల బాలుడు మృతి
Eluru: సరైన వైద్యం అందకపోవడంతో పరిస్థితి విషమించి బాలుడు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Eluru: వైద్యుల నిర్లక్ష్యంతో నెల రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. పుట్టిన నెల రోజులకే బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందాడని బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు.

అనారోగ్యంతో ఉన్న నెల రోజుల పసికందును పెదవేగి మండలం విజయరాయికి చెందిన తల్లిదండ్రులు ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బాలుడు కోలుకోకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.... మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళతామన్నా...వైద్యులు అడ్డుకున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.

సరైన వైద్యం అందకపోవడంతో పరిస్థితి విషమించి బాలుడు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా వైద్యులు నిర్లక్ష్యం వీడటంలేదని .. ఉన్నతాధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story