Bheemadolu : గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్దిని అనుమానాస్పద స్థితిలో మృతి

Bheemadolu : గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్దిని అనుమానాస్పద స్థితిలో మృతి
X

భీమడోలు మండలం పాలసానిపల్లి అంబేడ్కర్ గురుకుల కళాశాలలో గురువారం సాయంత్రం ఇంటర్ విద్యార్దిని లేళ్ల మానస (16) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భీమడోలు పంచాయతీ శివారు అర్జవారిగూడేనికి చెందిన ఈబాలిక కళాశాల బాత్రూమ్లో చున్నీతో ఉరి వేసుకున్న స్థితిలో ఉండగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. 'మా కుమార్తె మానస కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతోందని, పొలసానిపల్లి గురుకుల కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ఆహ్వానం వస్తే వెళ్లామని, మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాతోనే ఉందని, బాగా మాట్లాడిందని, కళాశాలకు వచ్చి తొమ్మిది రోజులే అయ్యిందని, ఊరికి రమ్మంటే దసరా సెలవులకు వస్తానని చెప్పిందని, ఇంతలోనే మరణ వార్తను వినాల్సి వచ్చిందని, మా కుమార్తె ఉరి వేసుకునేంత పిరికిది కాదని తల్లిదండ్రులు లేళ్ల మరియమ్మ, రాజు తెలిపారు. ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్, డీఎస్పీ శ్రావణ్ కుమార్, భీమడోలు తహసీల్దార్ రమాదేవి, సీఐ విల్సన్ హాస్పటల్ వద్ద, గురుకులంలో విచారణ చేపట్టారు. బాలిక మృతికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణ చేపట్టాలని, కుటుంబానికి నష్టపరిహారం అందించాలని, గ్రామస్థులు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story