వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఎదుటే రెండు వర్గాలు బాహాబాహీకి దిగారు. ఘర్షణ, తోపులాటతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటనా స్థలంలో ఉన్న మీడియా ప్రతినిధులపైనా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎంత సర్ధిచెప్పినా రెండు వర్గాలు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావు.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని కరిచర్లగూడెంలో సచివాలయ భవన నిర్మాణం విషయంలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. కరిచర్లగూడె గ్రామానికి చెందిన సచివాలయంను కోమటిగుంటలో నిర్మించడాన్ని వైసీపీలోని ఒక వర్గం తప్పుబట్టింది. దీనిపై మండిపడిన ప్రత్యర్థి వర్గం గొడవకు దిగారు. రెండు వర్గాల ఘర్షణతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com