JAGAN: జగన్ పర్యటనలో మళ్లీ ప్రమాదం

JAGAN: జగన్ పర్యటనలో మళ్లీ ప్రమాదం
X

కృ­ష్ణా జి­ల్లా పె­న­మ­లూ­రు ని­యో­జ­క­వ­ర్గం­లో మాజీ సీఎం జగన్ పర్య­టిం­చా­రు. ఈ పర్య­ట­న­లో మరో­సా­రి జగన్ కా­న్వా­య్ ఒక­దా­ని­కొ­క­టి ఢీ­కొ­న­డం కల­క­లం రే­పిం­ది. ఉయ్యూ­రు మం­డ­లం గం­డి­గుంట వద్ద కా­న్వా­య్ వా­హ­నా­లు ఒక దాని కొ­క­టి ఢీ­కొ­న్నా­యి. దీం­తో పలు­వు­రి­కి గా­యా­లు అయ్యా­యి. ఈ మే­ర­కు రహ­దా­రి­పై భా­రీ­గా ట్రా­ఫి­క్ జామ్ ఏర్ప­డి.. వా­హ­నా­లు ని­లి­చి­పో­యా­యి. ఎంత మెుర పె­ట్టు­కుం­టు­న్నా వి­న­కుం­డా.. జగన్ కా­న్వా­య్ ఇష్టం వచ్చి­న­ట్లు ముం­దు­కు సా­గిం­ద­ని పో­లీ­సు­లు ఆరో­పి­స్తు­న్నా­రు. వై­సీ­పీ నేతల అత్యు­త్సా­హం వల్లే ఇలాం­టి ఘట­న­లు పు­న­రా­వృ­తం అవు­తు­న్నా­య­ని స్థా­ని­కు­లు దు­మ్మె­త్తి పో­స్తు­న్నా­రు. అనంతరం పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు.

వైఎస్ జగన్ గత పర్యటనల్లోనూ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సింగయ్య అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోవటం అప్పట్లో రాజకీయంగా వివాదానికి కారణమైంది. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అప్పట్లో కూటమి ప్రభుత్వం, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి.

Tags

Next Story