Pawan Kalyan: జగన్ హైదరాబాద్లో దందాలు చేసేవాడు

జనసేన అధినేత పవన్కళ్యాణ్ నర్సాపురం సభలో సీఎం జగన్పై నిప్పులు చెరిగారు.జగన్ హైదరాబాద్లో కూర్చుని దందాలు చేసేవారంటూ ఘాటైన విమర్శలు చేశారు. తనను తిట్టినా ద్వేషించినా భరిస్తా కానీ అవినీతి, రౌడీయిజం చేస్తామంటే మాత్రం భరించనంటూ జగన్ సర్కార్కు పవన్ వార్నింగ్ ఇచ్చారు. జగన్కు అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని పవన్ ప్రశ్నించారు. అవినీతిపరులు రాష్ట్రాన్ని పాలిస్తే భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
జగన్ పులివెందుల రాజకీయం గోదావరి జిల్లాల్లో కుదరదన్నారు పవన్కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గోదావరి జిల్లాల్లో ఒక్కసీటు కూడా రాకుండా చూసే బాధ్యత తనదేనన్నారు. వైసీపీ నుంచి గోదావరి జిల్లాల ప్రజలకు విముక్తి కలిగిస్తానని చెప్పారు.
తాను రెండు చోట్ల ఓడినప్పుడు బాధేసిందన్నారు.అవినీతికి పాల్పడిన వారిని అందలం ఎక్కించారని అంబేద్కర్ ఆశయాలతో వెళ్లివారిని ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఎందుకు మార్పు రావడం లేదని పవన్ ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com