Tirupati : 'జగనన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త'.. జనసేన నేతల వినూత్న నిరసన
By - TV5 Digital Team |3 May 2022 1:45 PM GMT
Tirupati : జగనన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త అంటూ తిరుపతిలో జనసేన నేతలు వినూత్న నిరసనకు దిగారు.
Tirupati : జగనన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త అంటూ తిరుపతిలో జనసేన నేతలు వినూత్న నిరసనకు దిగారు. ఇటీవల ఒంగోలులో సీఎం పర్యటన సందర్భంగా కాన్వాయ్లో కారు తక్కువైందంటూ ఓ కుటుంబం దగ్గరి నుంచి పోలీసులు లాక్కెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.
హఠాత్తుగా పోలీసులు కారు లాక్కెల్లడంతో బాధితులు పిల్లాపాపల్తో రోడ్డున పడ్డారు. ఇక ఎల్లుండి సీఎం జగన్ తిరుపతి పర్యటన ఉంది. ఈనేపథ్యంలోనే జనసేన వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టింది. జగనన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త అంటూ దండోరా వేస్తూ తిరుపతిలో ప్రచారం చేస్తోంది.
జగనన్న వస్తే కార్లు ఎత్తుకెళ్తారంటూ జనాన్ని అప్రమత్తం చేస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com