PAWAN: మళ్లీ జన క్షేత్రంలోకి పవన్

టీడీపీ-జనసేన సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశం నిర్వహణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చర్చించారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అయిదో విడత వారాహి యాత్రపై పవన్ చర్చలు జరిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జనసైనికులు, వీర మహిళలపై అక్రమంగా పెడుతున్న కేసుల అంశం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించిన జనసేన అధినేత త్వరలో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని, అందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
రైతుల పక్షాన నిలవాలని అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు సూచించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణా పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం పై సుదీర్ఘంగా చర్చించారు. రైతుల పక్షాన చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమం గాపెడుతున్న కేసులపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది.
తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు జనసేన పార్టీ కమిటీ నియామకం ఎప్పుడో పూర్తి చేసింది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కమిటీ ప్రకటించారు. జనసేన కమిటీకి చైర్మన్గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సభ్యులుగా మరో ఐదుగురిని ప్రకటించారు. జనసేన కమిటీలో సభ్యులుగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, జనసేన పార్టీ మత్స్యకార విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్ సభ్యులుగా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ ఐదుగురు సభ్యులతో కమిటీ ప్రకటించింది.పార్టీ అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ,పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్,మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు పార్టీల కమిటీలు కలిసి జేఏసీగా ఏర్పడనున్నాయి. ఇకపై జేఏసీ ద్వారా ఉమ్మడి కార్యాచరణ రూపొందించనున్నాయి. ృఇకపై ఉమ్మడి కార్యాచరణ కమిటీ రెండు పార్టీలు కలిసి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేయనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com