Kadapa: కడపలో టెన్షన్..టెన్షన్
కడప నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నగర అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ మధ్య సవాళ్ల పర్వంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ విపక్ష నేతలకు డిప్యూటీ సీఎం అంజాద్ భాష సవాల్ సవాల్ విసిరారు. అంజాద్ భాష సవాల్ను స్వీకరించిన టీడీపీ పోలీట్ బ్యూరో మెంబర్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి చర్చకు సిద్ధమైయ్యారు. అయితే నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో చర్చకు బయల్దేరేందుకు సిద్ధమైన శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరించారు. ఇక టీడీపీ, వైసీపీ సవాళ్లతో కడపలో టెన్షన్ నెలకొంది. మరో టీడీపీ నేత హరిప్రసాద్ ను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక పోలీసులు అనుమతి ఇవ్వకపోతే అంజాద్ బాష తన ఇంటి వద్దకే చర్చకు రావాలని శ్రీనివాస్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. శాంతియుతంగా నగర అభివృద్ధిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇక టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లతో కడపలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com