అమరావతికి మద్దతుగా కాగడాల ప్రదర్శన

అమరావతికి మద్దతుగా కాగడాల ప్రదర్శన

అమరావతికి మద్దతుగా కృష్ణా జిల్లా గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.. అటు.. మందడంలో రైతులు కాగడాల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో పోలీసులు బలవంతంగా దీక్షా శిబిరం నుంచి బయటకు పంపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి సాధించేవరకు ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Tags

Next Story