Kondapalli: పూర్తయిన కొండపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ..
Kondapalli (tv5news.in)
By - Divya Reddy |24 Nov 2021 6:27 AM GMT
Kondapalli: ఎట్టకేలకు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది.
Kondapalli: ఎట్టకేలకు కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. టీడీపీకి అనుకూలంగా 16మంది, వైసీపీ తరఫున 15 మంది సభ్యులు చేతులెత్తారు. TDP ఛైర్మన్ అభ్యర్థిగా చెన్నుబోయిన చిట్టిబాబును ప్రకటించారు. వైస్ ఛైర్మన్లుగా శ్రీనివాస్, శ్రీలక్షిల పేర్లను ప్రతిపాదించారు. హైకోర్టు ఆదేశాలు ఉండటంతో ఫలితాలు ప్రకటించలేదు. ఈ మేరకు ఎన్నిక ప్రక్రియ వివారాల్ని హైకోర్టులో సమర్పిస్తారు అధికారులు. న్యాయస్థానం తదుపరి ఆదేశాల ప్రకారం ఫలితం ప్రకటిస్తారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com