వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

X
By - TV5 Digital Team |3 Feb 2021 5:43 PM IST
అక్రమ అరెస్టులకు భయపడబోమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్, పట్టాభిపై దాడిని ఆయన ఖండించారు.
అక్రమ అరెస్టులకు భయపడబోమని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్, పట్టాభిపై దాడిని ఆయన ఖండించారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో వైసీపీ ఆటలు సాగవని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com