ప్రభుత్వం అనుమతిచ్చాకే కరోనా మందు పంపిణీ..!

X
By - TV5 Digital Team |28 May 2021 7:30 PM IST
ఇవాల్టి నుంచి మందు పంపిణీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని అన్నారు.
ప్రభుత్వ అనుమతి ఇచ్చాకే కరోనా మందు పంపిణీ మొదలవుతుందని ఆనందయ్య స్పష్టం చేశారు. ఇవాల్టి నుంచి మందు పంపిణీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని అన్నారు. ప్రస్తుతం తన వద్ద కరోనా మందు తయారీకి కావాల్సిన వనమూలికలు, ద్రవ్యాలు లేవని అనుమతి రాగానే అన్ని సమకూర్చుకొని అందరికీ మందు సరఫరా చేస్తానని అన్నారు. కృష్ణపట్నంకి కరోనా రోగులు మరోసారి క్యూ కడుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని ఆపేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఖండిస్తూ ఆనందయ్య ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఎవరు కూడా కృష్ణపట్నం రావద్దని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com