అమ్మ ఒడికి బదులుగా ల్యాప్టాప్లు... టెండర్ నోటీస్ జారీకి ఏపీ సర్కార్ నిర్ణయం..!

X
By - /TV5 Digital Team |10 Sept 2021 1:15 PM IST
జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులు ల్యాప్టాప్లు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించారు.
జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులు ల్యాప్టాప్లు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించారు. బేసిక్ కాన్ఫిగరేషన్తో ఉండే 5 లక్షల 62 వేల ల్యాప్టాప్లు అలాగే హై కాన్ఫిగరేషన్తో 90 వేల 926 ల్యాప్టాప్ల కొనుగోళ్లకు టెండర్లు పిలవనున్నారు. ఇందుకోసం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ బిడ్లను ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించిన ఫైల్ను జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపినట్టు తెలుస్తోంది. ఈనెల 17లోగా అభ్యంతరాలు, సూచనలు కోరిన ప్రభుత్వం ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుని టెండర్లకు వెళ్లనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com