LOKESH: భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్ వే

LOKESH: భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్ వే
X
ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న లోకేశ్ పర్యటన.. గ్రిఫిత్ యూనివర్సిటీని సందర్శించిన లోకేశ్.. ఏపీలో హబ్ ఏర్పాటు చేయాలని లోకేశ్ వినతి

భారత్-ఆస్ట్రేలియాల నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని ఏపీ విద్య, ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు,ఆభరణాలు,వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. బ్రిస్బేన్‌లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.


గ్రి­ఫి­త్ యూ­ని­వ­ర్సి­టీ వైస్ ప్రె­సి­డెం­ట్ (గ్లో­బ­ల్) మా­ర్నీ వా­ట్స­న్‌­తో గో­ల్డ్ కో­స్ట్ క్యాం­ప­స్‌­లో భేటీ అయ్యా­రు. యూ­ని­వ­ర్సి­టీ స్పో­ర్ట్స్ కళా­శా­ల­లో అధు­నా­తన క్రీ­డా సౌ­క­ర్యా­ల­ను పరి­శీ­లిం­చా­రు. పబ్లి­క్ పా­ల­సీ, సస్టై­న­బి­లి­టీ, ఇన్నో­వే­ష­న్ రం­గా­ల్లో సం­యు­క్త కా­ర్య­క్ర­మాల కోసం చొరవ చూ­పా­ల­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్-గ్రి­ఫి­త్ వి­శ్వ­వి­ద్యా­ల­యం భా­గ­స్వా­మ్యం ఏర్పా­టు చే­యా­ల­ని కో­రా­రు. పరి­శో­ధన, వి­ద్యా­ర్థుల మా­ర్పి­డి, అవ­గా­హన సమ­న్వ­యా­ని­కి ఏపీ­లో హబ్‌ ఏర్పా­టు చే­యా­ల­ని వి­జ్ఞ­ప్తి చే­శా­రు. సి­ల­బ­స్, నై­పు­ణ్య ధ్రు­వీ­క­ర­ణ­కు ఏపీ వర్సి­టీ­ల­తో భా­గ­స్వా­మ్యం వహిం­చా­ల­ని కో­రా­రు.

‘‘పు­న­రు­త్పా­దక శక్తి, ప్ర­జా­రో­గ్యం, నీటి ని­ర్వ­హణ రం­గా­ల్లో సం­యు­క్త పరి­శో­ధన ప్రా­జె­క్టు­లు ప్రా­రం­భిం­చా­లి. గ్రి­ఫి­త్ యూ­ని­వ­ర్సి­టీ, ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని ప్ర­ముఖ వి­ద్యా­సం­స్థల మధ్య డ్యూ­య­ల్ డి­గ్రీ లేదా ట్వి­న్నిం­గ్ ప్రో­గ్రా­మ్‌­ల­ను అభి­వృ­ద్ధి చే­యా­లి. స్కా­ల­ర్‌­షి­ప్‌­లు, అధ్యా­ప­కు­లు, వి­ద్యా­ర్థుల అభి­వృ­ద్ధి­కి ఎక్స్చేం­జి కా­ర్య­క్ర­మా­ల­ను ప్రో­త్స­హిం­చా­లి. నవం­బ­ర్ 14, 15 తే­దీ­ల్లో ని­ర్వ­హిం­చే వి­శాఖ భా­గ­స్వా­మ్య సద­స్సు­కు హా­జ­రు కా­వా­లి. స్టా­ర్ట­ప్‌­ల­కు మద్ద­తు­ని­చ్చే­లా ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రతన్ టాటా ఇన్నో­వే­ష­న్ హబ్‌­తో కలి­సి పని­చే­యా­లి’’ అని లో­కే­శ్‌ వి­జ్ఞ­ప్తి చే­శా­రు.


స్మార్ట్ ఫార్మింగ్‌ సాయానికి విజ్ఞప్తి

ఏపీ­లో ఏఐ ఆధా­రిత స్మా­ర్ట్ ఫా­ర్మిం­గ్ కు సహ­కా­రం అం­దిం­చా­ల­ని లో­కే­ష్ వె­స్ట్ర­న్ సి­డ్నీ యూ­ని­వ­ర్సి­టీ పరి­శో­ధ­కు­ల­ను కో­రా­రు. ఈ మే­ర­కు యూ­ని­వ­ర్సి­టీ సీ­ని­య­ర్ ఎగ్జి­క్యూ­టి­వ్ లు, అగ్రి­క­ల్చ­ర­ల్ టె­క్నా­ల­జీ పరి­శో­ధ­కు­ల­తో భేటీ అయ్యా­రు. ఏఐ ఆధా­రిత వ్య­వ­సాయ హబ్ ల ఏర్పా­టు ద్వా­రా ఏపీ­లో వ్య­వ­సాయ ఆధు­నీ­క­ర­ణ­కు సహ­క­రిం­చా­ల­న్నా­రు. వా­తా­వ­రణ మా­ర్పు­ల­ను తట్టు­కో­గ­లి­గే పం­ట­లు, ప్రె­సి­ష­న్ ఫా­ర్మిం­గ్ లో నై­పు­ణ్యా­ల­ను ఆచా­ర్య ఎన్.జి.రంగ వ్య­వ­సాయ వి­శ్వ­వి­ద్యా­ల­యం­తో కలి­సి పం­చు­కో­వా­ల­న్నా­రు. రై­తు­లు, అగ్రి-ప్రొ­ఫె­ష­న­ల్స్ కు స్మా­ర్ట్ ఫా­ర్మిం­గ్ టె­క్ని­క్‌­లు, అగ్రి-టెక్ ఇన్నో­వే­ష­న్ల­లో శి­క్షణ ఇచ్చే సం­యు­క్త కా­ర్య­క్ర­మా­ల­ను ని­ర్వ­హిం­చా­ల­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వా­ని­కి వ్య­వ­సాయ వి­ధా­నా­లు, స్థి­ర­మైన అభి­వృ­ద్ధి వ్యూ­హా­ల­పై పరి­శో­ధన ఆధా­రిత సూ­చ­న­లు అం­దిం­చా­ల్సిం­ది­గా వి­జ్ఞ­ప్తి చే­శా­రు. భా­ర­త్-ఆస్ట్రే­లి­యా వా­ణి­జ్య సం­బం­ధా­ల­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ కీలక పా­త్ర పో­షి­స్తోం­ద­ని మం­త్రి నారా లో­కే­శ్‌ తె­లి­పా­రు. భా­ర­త­దే­శం­లో పె­ట్టు­బ­డు­ల­కు ఏపీ ప్ర­ధాన గమ్య­స్థా­నం­గా మా­రిం­ద­ని ఆయన అన్నా­రు. భా­ర­త్‌-ఆస్ట్రే­లి­యా మధ్య సు­హృ­ద్భా­వ­పూ­ర్వక ద్వై­పా­క్షిక వా­ణి­జ్యం ని­రం­త­రం­గా ­సా­గు­తోం­ద­ని చె­ప్పా­రు.

Tags

Next Story