LOKESH: ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌:లోకేశ్‌

LOKESH: ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌:లోకేశ్‌
X
ఏపీ రూపు రేఖలు మారుతాయన్న ఏపీ మంత్రి

మై­క్రో­సా­ఫ్ట్‌ హై­ద­రా­బా­ద్‌ రూ­పు­రే­ఖ­లు మా­ర్చిం­ద­ని.. ఇప్పు­డు గూ­గు­ల్‌ పె­ట్టు­బ­డు­ల­తో వి­శాఖ రూ­పు­రే­ఖ­లు మా­ర­బో­తు­న్నా­య­ని మం­త్రి నారా లో­కే­శ్‌ అన్నా­రు. అ‘‘కే­వ­లం డేటా సెం­ట­ర్‌ మా­త్ర­మే కాదు.. ఏఐకి సం­బం­ధిం­చిన అనేక కం­పె­నీ­లు వి­శా­ఖ­కు వస్తు­న్నా­యి. స్పీ­డ్‌ ఆఫ్‌ డూ­యిం­గ్‌ బి­జి­నె­స్ కింద రా­ష్ట్రా­ని­కి పరి­శ్ర­మ­లు తర­లి­వ­స్తు­న్నా­యి. గూ­గు­ల్‌ పె­ట్టు­బ­డి­తో లక్ష మం­ది­కి పైగా ఉపా­ధి అవ­కా­శా­లు కల­గ­ను­న్నా­యి. సె­ప్టెం­బ­ర్‌ 2024లో గూ­గు­ల్‌ ప్ర­తి­ని­ధు­లు వి­శాఖ వచ్చి­న­ప్పు­డు వా­రి­తో సమా­వే­శ­మ­య్యా­ను. వా­రి­కి డేటా సెం­ట­ర్‌ స్థ­లా­న్ని చూ­పిం­చాం. ఇది జరి­గిన నెల రో­జు­ల్లో యూ­ఎ­స్‌ వె­ళ్లి గూ­గు­ల్‌ క్లౌ­డ్‌ నా­య­క­త్వా­న్ని కలి­శా. నవం­బ­ర్‌­లో గూ­గు­ల్‌ ప్ర­తి­ని­ధు­లు సీ­ఎం­ను కలి­శా­రు. ఇదే అం­శం­పై ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ, కేం­ద్ర మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్‌­తో చం­ద్ర­బా­బు అనే­క­సా­ర్లు భేటీ అయ్యా­రు. అనేక చర్చల తర్వాత ఇంత పె­ద్ద పె­ట్టు­బ­డి సా­ధ్య­మైం­ది. భారీ పె­ట్టు­బ­డు­ల­పై అన్ని చో­ట్లా చర్చ­లు జరు­గు­తు­న్నా­యి. అభి­వృ­ద్ధి వి­కేం­ద్రీ­క­రణ మా లక్ష్యం ఒకే రా­ష్ట్రం.. ఒకే రా­జ­ధా­ని.. అభి­వృ­ద్ధి వి­కేం­ద్రీ­క­రణ మా లక్ష్యం. అనం­త­పు­రం, కర్నూ­లు­కు పం­ప్డ్‌‌ స్టో­రే­జ్‌, సి­మెం­ట్‌ ఫ్యా­క్ట­రీ­లు వస్తు­న్నా­యి. చి­త్తూ­రు, కడ­ప­లో ఎల­క్ట్రా­ని­క్స్‌ మ్యా­ను­ఫ్యా­క్చ­రిం­గ్‌ ఎకో సి­స్ట­మ్‌­ను తీ­ర్చి­ది­ద్దు­తు­న్నాం. శ్రీ­సి­టీ గ్రే­ట­ర్‌ ఎకో­సి­స్ట­మ్‌­లో అనేక పె­ట్టు­బ­డు­లు తీ­సు­కొ­స్తు­న్నాం. డై­కె­న్‌, బ్లూ­స్టా­ర్‌, ఎల్జీ పె­ట్టు­బ­డు­లు పె­రు­గు­తు­న్నా­యి. అన్ని ప్రాం­తా­ల­ను సమ­గ్ర అభి­వృ­ద్ధి చే­య­డ­మే లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నాం." అని లో­కే­శ్ అన్నా­రు.

పౌర సేవలు, ఆర్టీజీఎస్‌పై చంద్రబాబు సమీక్ష

ప్ర­భు­త్వ శా­ఖ­లు అం­దిం­చే పౌర సే­వ­లు, ఆర్టీ­జీ­ఎ­స్‌­పై ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. ఆర్టీ­జీ­ఎ­స్ కేం­ద్రం­లో వి­విధ శాఖల సే­వ­లు, ప్ర­జా సం­తృ­ప్త స్థా­యి­పై ము­ఖ్య­మం­త్రి సమీ­క్షిం­చా­రు. ఈ భే­టీ­లో సమా­చార శాఖ మం­త్రి కె.పా­ర్థ­సా­ర­థి, ఐటీ, ఆర్టీ­జీ­ఎ­స్, ఎక్సై­జ్ శాఖల అధి­కా­రు­లు పా­ల్గొ­న్నా­రు. జీ­ఎ­స్టీ 2.0 సం­స్క­ర­ణ­ల­తో ప్ర­జ­ల­కు కలి­గిన ప్ర­యో­జ­నా­లు తది­తర అం­శా­ల­పై వి­వ­రా­ల­ను సీఎం అడి­గి తె­లు­సు­కు­న్నా­రు. ని­త్యా­వ­స­రా­లు, ఇతర ఉత్ప­త్తు­ల­పై పన్ను­లు తగ్గిన అం­శం­పై గి­రి­జన ప్రాం­తా­ల్లో పె­ద్ద ఎత్తున అవ­గా­హన కల్పిం­చా­ల­ని సూ­చిం­చా­రు. దీ­పా­వ­ళి తర్వాత కూడా ప్ర­జ­ల్లో­కి పన్ను తగ్గిం­పు అం­శా­న్ని తీ­సు­కె­ళ్లా­ల­ని ఆదే­శిం­చా­రు.

Tags

Next Story