LOKESH: జగన్ మరీ ఇంత పిరికివాడా: నారా లోకేశ్

LOKESH: జగన్ మరీ ఇంత పిరికివాడా: నారా లోకేశ్
X
జగన్ ఎక్కడికైనా వెళ్లొచ్చన్న నారా లోకేశ్

అసెం­బ్లీ­కి రా­వ­ట్లే­దం­టే­నే జగన్ ఎంత పి­రి­కి­వా­డో అర్ధ­మ­వు­తోం­ద­ని ఏపీ వి­ద్యా శాఖ మం­త్రి నారా లో­కే­శ్​ ఎద్దే­వా చే­శా­రు. తాము ప్ర­తి­ప­క్షం­లో ఉన్నా చి­వ­రి రోజు వరకూ అసెం­బ్లీ­లో పో­రా­డా­మ­ని గు­ర్తు­చే­శా­రు. చం­ద్ర­బా­బు అసెం­బ్లీ­ని ఏ సం­ద­ర్భం­లో వది­లా­రో వీ­డి­యో రి­కా­ర్డు­ల­తో సహా ప్ర­జ­లం­తా చూ­శా­ర­ని నారా లో­కే­శ్ గు­ర్తు చే­శా­రు. అసెం­బ్లీ­లో తె­లు­గు­దే­శం ఎమ్మె­ల్యే­లు అం­ద­రి­నీ సస్పెం­డ్ చే­సి­నా చం­ద్ర­బా­బు ఒక్క­రే తన వాదన వి­ని­పిం­చి ప్ర­జా సమ­స్య­ల­పై పో­రా­డా­ర­ని చె­ప్పా­రు. అసెం­బ్లీ­కి రా­కుం­డా దొం­గ­చా­టు­గా వై­ఎ­స్సా­ర్​­సీ­పీ ఎమ్మె­ల్యే­లు రి­జి­స్ట­ర్​­లో సం­త­కా­లు చే­స్తు­న్నా­ర­ని వి­మ­ర్శిం­చా­రు. అసెం­బ్లీ­లో ఎమ్మె­ల్యే­లు సం­త­కా­లు పె­ట్టే రి­జి­స్ట­ర్​ సభ లోపల పె­ట్టే­లా స్పీ­క­ర్ ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని వి­జ్ఞ­ప్తి చే­శా­రు. జగన్ అసెం­బ్లీ­కి రా­వ­చ్చ­ని సరి­ప­డా సమయం స్పీ­క­ర్ ఇస్తా­ర­ని స్ప­ష్టం చే­శా­రు. అసెం­బ్లీ­కి వచ్చి జగన్ అన్ని మా­ట్లా­డ­వ­చ్చ­న్నా­రు. జగన్ మైక్ స్పీ­క­ర్ ఎం­దు­కు కట్ చే­స్తా­ర­ని ప్ర­శ్నిం­చా­రు. కనీ­సం తన సొంత ని­యో­జ­క­వ­ర్గ­మైన పు­లి­వెం­దుల సమ­స్య­లై­నా సభ దృ­ష్టి­కి తీ­సు­కు­రా­వా­ల­న్న ఆలో­చన ఆయ­న­కు లేదా అని ని­ల­దీ­శా­రు. వై­సీ­పీ ఎప్పు­డూ కు­లా­లు, ప్రాం­తాల మధ్య వి­ద్వే­షా­లు రె­చ్చ­గొ­ట్టే ప్ర­య­త్న­మే చే­స్తుం­ద­ని, ఆ పా­ర్టీ చర్యల పట్ల ప్ర­జ­లు అప్ర­మ­త్తం­గా ఉం­డా­ల­ని ఆయన సూ­చిం­చా­రు.

జగ­న్‌ ఎక్క­డి­కై­నా స్వే­చ్ఛ­గా వె­ళ్ల­వ­చ్చ­ని, ప్ర­భు­త్వం ఎలాం­టి గృహ ని­ర్బం­ధా­లు వి­ధిం­చ­బో­ద­ని లో­కే­శ్‌ స్ప­ష్టం చే­శా­రు. అయి­తే, శాం­తి­భ­ద్ర­త­ల­కు భంగం కలి­గిం­చా­ల­ని చూ­సి­నా, పె­ట్టు­బ­డి­దా­రు­ల­ను భయ­పె­ట్టే ప్ర­య­త్నా­లు చే­సి­నా కఠి­నం­గా వ్య­వ­హ­రి­స్తా­మ­ని, ఎట్టి పరి­స్థి­తు­ల్లో­నూ ఉపే­క్షిం­చే­ది లే­ద­ని ఆయన హె­చ్చ­రిం­చా­రు. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు ఈ వారం మొ­త్తం కీలక సమా­వే­శా­ల­తో తీ­రిక లే­కుం­డా ఉన్నా­ర­ని, ఆరో­గ్యం దృ­ష్ట్యా ఎక్కు­వ­గా తి­ర­గ­వ­ద్ద­ని చె­ప్పి­నా ఆయన ప్ర­జా సం­క్షే­మం కో­స­మే పని­చే­స్తు­న్నా­ర­ని లో­కే­శ్‌ తె­లి­పా­రు. రా­ష్ట్ర అభి­వృ­ద్ధి ప్ర­ణా­ళి­కల గు­రిం­చి మా­ట్లా­డు­తూ, వచ్చే ఏడా­ది జన­వ­రి నా­టి­కి ఏపీ­లో క్వాం­టం కం­ప్యూ­ట­ర్‌ అం­దు­బా­టు­లో­కి వస్తుం­ద­ని ప్ర­క­టిం­చా­రు. అక్టో­బ­ర్‌ నుం­చి రా­ష్ట్రా­ని­కి వరు­స­గా పె­ట్టు­బ­డు­లు ఆక­ర్షిం­చేం­దు­కు పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­తో చర్చి­స్తు­న్నా­మ­ని తె­లి­పా­రు. రా­ష్ట్రం­లో 20 లక్షల ఉద్యో­గా­లు కల్పిం­చ­డ­మే లక్ష్యం­గా ని­ర్వి­రా­మం­గా కృషి చే­స్తు­న్నా­మ­ని లో­కే­శ్‌ అభి­ప్రా­య­ప­డ్డా­రు.

ఒక తరగతికి.. ఒక టీచర్ : మంత్రి

ఒక తర­గ­తి­కి ఒక ఉపా­ధ్యా­యు­డు ఉం­డా­ల­నే­ది తమ ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని మం­త్రి నారా లో­కే­శ్ తె­లి­పా­రు. వి­ద్యా­ర్థుల సం­ఖ్య ఆధా­రం­గా­నే.. టీ­చ­ర్ల ని­యా­మ­కం, తర­గ­తి గదుల ని­ర్మా­ణం చే­ప­డు­తు­న్నా­మ­ని చె­ప్పా­రు. మన బడి-మన భవి­ష్య­త్తు కింద పా­ఠ­శాల భవన ని­ర్మా­ణా­లు కొ­న­సా­గు­తు­న్నా­య­ని పే­ర్కొ­న్నా­రు. ప్రై­మ­రీ స్కూ­ళ్ల­ను అప్ప­ర్ ప్రై­మ­రీ స్కూ­ళ్ల­లో వి­లీ­నం­పై లో­కే­శ్‌­ సమా­ధా­నం ఇచ్చా­రు. ప్రై­వే­టు పా­ఠ­శా­ల­ల­ను మిం­చి ప్ర­భు­త్వ బడు­ల­ను తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని మం­త్రి హామీ ఇచ్చా­రు.

Tags

Next Story