LOKESH: మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకెక్కడిది?

LOKESH: మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకెక్కడిది?
X
వైసీపీకి నారా లోకేశ్ మరో సవాల్.. తల్లికి వందనం ఫేక్ ప్రచారంపై ఆగ్రహం

తల్లికి వందనం అర్హులు ఎంతమంది ఉంటే అంత మందికీ లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చిందని కాని కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు ఇచ్చామని తెలిపారు. అర్హులు ఇంకా ఉన్నా ఇస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం కంటే రూ.3405 కోట్లు అదనంగా తల్లికి వందనం నిధులు చెల్లిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకూ 18.55 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని తెలిపారు. అలానే 9600 పాఠశాలల్లో ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు విధానం పెట్టామని గత ప్రభుత్వంలో కేవలం 1200 పాఠశాలల్లో మాత్రమే ఈ విధానం అమలైందని తెలిపారు. సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే వాట్సాప్ కంప్లెయింట్ ద్వారా వాటిని పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. 2 శాతం మంది తల్లుల అకౌంట్ ఇనాక్టివ్​గా ఉన్నాయని, వారిని మెసేజ్ ద్వారా అప్రమత్తం చేశామని తెలిపారు. **ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి తల్లుల ఖాఆలో నగదు జమ అవుతోంది. తల్లికి వందనం పథకంలో అందించే నగదు రూ.15 వేలు కాగా, ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి ఖాతాలో జమ అవుతుంది. మిగిలిన 2 వేలు పాఠశాల/కాలేజీ విద్యాభివృద్ధి నిధి నిమితం ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ అవుతాయి.

జగన్‌పై ఆగ్రహం

లోకేశ్, వైసీపీ అధినేత జగన్ కు తీవ్రస్థాయిలో సవాల్ విసిరారు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తల్లికి వందనం' పథకానికి సంబంధించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు."జగన్... నా నుంచి నీకు మరో సవాల్. తల్లికి వందనం పథకంలో రూ.2 వేలు లోకేశ్ అకౌంటులో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు... ఈ ఆరోపణలను నిరూపించడానికి 24 గంటల సమయం ఇస్తున్నాను... దమ్ముంటే నిరూపించాలి" అని లోకేశ్ సవాల్ చేశారు. ఒకవేళ ఈ ఆరోపణలను నిరూపించలేకపోతే, చేసిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకుని, జరిగిన తప్పును అంగకరించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో, చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ రకమైన అసత్య ప్రచారాలను ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. **ఏపీలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Tags

Next Story