Panchumarthi Anuradha: అప్పుడు, ఇప్పుడు అదృష్టం ఆమెకు అనుకూలంగా..

Panchumarthi Anuradha: టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ పార్టీలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె 23 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొన్నాళ్లుగా కెరీర్లో 'టర్నింగ్ పాయింట్' కోసం ఎదురుచూస్తున్న ఆమె కోరికను ఎమ్మెల్సీ ఎన్నికలు నెరవేర్చాయి. విజయవాడకు చెందిన పంచుమర్తి 1990లలో రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ జిల్లా కార్యదర్శిగా, విజయవాడ నగర కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1994లో కార్పొరేషన్ ఎన్నికలలో ఆమె వార్డు మెంబర్గా ఎన్నికయ్యారు. విజయవాడ మేయర్గా ఐదేళ్లు పని చేశారు. మేయర్గా విజయవాడ నగర అభివృద్ధికి ఆమె చేసిన కృషి అనిర్వచనీయం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత వర్ల రామయ్యను బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం భావించింది. కానీ చివరి నిమిషంలో అదృష్టం అనురాధను వరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com