Crime: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల పాపను చంపిన దుర్మార్గుడు

Crime: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల పాపను చంపిన దుర్మార్గుడు
ఆకలి అని ఏడ్చినందుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అమ్ములు అనే మూడేళ్ల చిన్నారిని దారుణంగా హత్య

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం కల్దుర్తిలో దారుణం జరిగింది. ఆకలి అని ఏడ్చినందుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అమ్ములు అనే మూడేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..నిర్మల్ జిల్లాకు చెందిన ఓ మహిళ భర్తకు దూరంగా ఉంటుంది. కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఈమెకు మూడేళ్ల పాప ఉంది. ఈ క్రమంలోనే ఆమెకు నిజామాబాద్ జిల్లా వెల్దుర్తికి చెందిన సంజీవ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో సదరు మహిళ ప్రియుడి గ్రామంలోనే కూతురితో కలిసి నివాసముంటుంది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి పాప ఆకలితో ఏడ్చింది ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న సంజీవ్‌ చిన్నారిని కర్రతో కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువు గట్టు వద్ద పడేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సంజీవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story