Botsa Satyanarayana : వైసీపీ మంత్రులు సన్నాసులైతే, పవన్ ఏంటో అందరికీ తెలుసు: మంత్రి బొత్స

X
By - /TV5 Digital Team |26 Sept 2021 2:50 PM IST
Botsa Satyanarayana : వైసీపీ మంత్రులు సన్నాసులైతే, పవన్ కల్యాణ్ ఏంటో అందరికీ తెలుసంటూ ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Botsa Satyanarayana : వైసీపీ మంత్రులు సన్నాసులైతే, పవన్ కల్యాణ్ ఏంటో అందరికీ తెలుసంటూ ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. డిస్ట్రిబ్యూటర్లకు లేని బాధ పవన్ కల్యాణ్కు ఎందుకుని ప్రశ్నించారు. సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి, ప్రజలపై భారం వేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని పవన్పై మండిపడ్డారు. అసలు సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ లేకుండా పోతోందని, జీఎస్టీ లాంటి పన్నులను స్ట్రీమ్ లైన్ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. ఆ మాటకొస్తే సినిమా టికెట్ల ఆన్లైన్ అమ్మకాల విధానాన్ని డిస్ట్రిబ్యూటర్లే అడిగారన్నారు మంత్రి బొత్స. సినీ పరిశ్రమలో పవన్ ఒక్కడే లేడని, చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలు కూడా ప్రభుత్వంతో సంప్రదించవచ్చని చెప్పుకొచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com