Perni Nani : పోలవరం ప్రాజెక్టు వద్ద పోలీసులపై రెచ్చిపోయిన మంత్రి పేర్నినాని

Perni Nani : ఏపీ మంత్రి పేర్నినాని పోలీసులపైనే రెచ్చిపోయారు. తమాషాలు చేస్తున్నారా.. నేను ఇంచార్జ్ మంత్రిని అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇక్కడితో పండుగ అయిపోలేదు అంటూ పేర్నినాని.. పోలీసులపై ఆగ్రహించారు. ఈ ఘటన పోలవరం ప్రాజెక్టు వద్ద చోటుచేసుకుంది.కేంద్రమంత్రి షెకావత్ పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో మంత్రి పేర్నినాని అక్కడి వెళ్లారు.
అయితే రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న పేర్నినాని కారును అక్కడి నుంచి తీయాలని పోలీసులు సూచించారు. అంతే.. ఒక్కసారిగా మంత్రి రెచ్చిపోయారు. కారు తీయమన్నది ఎవరు అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. అక్కడ పార్కింగ్ చేసి ఉన్న కార్లు ఎవరివని నిలదీశారు. ఎస్పీ, డీఐజీ కార్లు అంటూ పోలీసులు బదులిచ్చారు. దీంతో మరింత ఆగ్రహించిన పేర్నినాని.. తమాషాలు చేస్తున్నారా.. ఇక్కడితో పండుగ అయిపోలేదు.. మీ అంతు చూస్తాను అనేంతంగా వార్నింగ్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com