రాబోయే బడ్జెట్ సమావేశాలు నాకు చివరి సమావేశాలు : ఎంపీ రఘురామ

X
By - TV5 Digital Team |17 Jan 2022 10:00 PM IST
తన ప్రాణాలను కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నానని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
తన ప్రాణాలను కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నానని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. 17న విచారణకు రాలేని సీఐడీకి తెలిపానన్న ఆయన.. తన ఆరోగ్యం బాగోలేదని.. ఇవాళ, రేపు మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. తాను వంకలు పెట్టి తప్పించుకునేవాడిని కాదని.. రాబోయే బడ్జెట్ సమావేశాలు తనకు చివరి సమావేశాలని అన్నారు. ప్రధానికి రాసిన లేఖలో అన్ని విషయాలు వివరించానన్న రఘురామ.. ఇప్పటికే ప్రధాని, అమిత్షా అపాయింట్మెంట్ కోరానన్నారు. విజయసాయిరెడ్డి విమర్శలకు అదే రీతిలో బదులిచ్చారు రఘురామ. త్వరలోనే తన పరిస్థితే విజయసాయిరెడ్డికి వస్తుందని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com