Nara Lokesh : యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో లోకేష్ కు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. గోరవయ్యాల నృత్యాలతో ఆయనకు స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో ఎదురెళ్లి స్వాగతించారు. తమ అభిమాన నేతకు భారీ గజమాల వేసి అభిమానాన్ని చాటుకున్నారు యువకులు. అనంత అర్బన్లోమాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు,మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి,టీడీపీ నేత జితేంద్ర గౌడ్లు లోకేష్కు స్వాగతం పలికారు. అశేష జన వాహిన మధ్య అనంత అర్బన్ నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది.
ఇక భోజన విరామం అనంతరం సాయంత్రం 4గంటలకు విజయనగర్ కాలనీలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం వాల్మీకి, రజకులతో భేటీ అవుతారు. 5గంటల 25నిమిషాలకు ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశమవుతారు. 5గంటల 35నిమిషాలకు పవర్ హౌస్ సర్కిల్ లో ముస్లింలతో ఆత్మీ య సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. 5గంటల 45నిమిషాలకు బసవన్న గుడి వద్ద ఆర్యవైశ్య సామాజిక వర్గీయులతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత విజయ క్లాత్ సెంటర్లో కురుబ సామాజికవర్గీయులతో.. 6 గంటల 5నిమిషాలకు సూర్యనగర్లో మద్దెర సామాజికవర్గీయులతో సమావేశమవుతారు. 6గంటల 25 నిమిషాలకు సప్తగిరి సర్కిల్లో నాయి బ్రహ్మాణులు, ఆ తర్వాత క్రిస్టియన్ సామాజికవర్గీయులతో మాటమంతీ నిర్వహిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com