అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీకి అధినేత జగన్ : లోకేష్
మేనిఫెస్టోలో చెప్పిన అన్ని అంశాలను తెలుగుదేశం పార్టీ నెరవేర్చి తీరుతుందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక.. టీడీపీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారని ఆయన మండిపడ్డారు.
పలాస, రాయదుర్గంతోపాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగన్ అని ఆరోపించారు. తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని భయమని ఎద్దేవా చేశారు. వైసీపీ అభ్యర్ధులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయమని.. అందుకే పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు.
పురపాలక ఎన్నికల్లో గెలిచే టీడీపీ అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని.. నువ్వొక నాయకుడివి.. నీదొక పార్టీ.. అందుకే నిన్ను పిరికివాడు అనేది జగన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com