వైసీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోంది: లోకేష్

X
By - Subba Reddy |24 May 2023 6:15 PM IST
పాదయాత్రలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సుద్దపల్లె వద్ద గండికోట, రాజోలి రిజర్వాయర్ల బాధిత రైతులతో లోకేష్ ముఖాముఖి
వైసీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సుద్దపల్లె వద్ద.. గండికోట, రాజోలి రిజర్వాయర్ల బాధిత రైతులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. పునరావాస కాలనీలో మౌలిక వసతుల్లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. పట్టించుకునే వారే లేరని లోకేష్ మండిపడ్డారు. సీఎం సొంత జిల్లాలో రైతులను ఆదుకునే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తొలి సంవత్సరంలోనే గండికోట, రాజోలి ప్రాజెక్టు నిర్వాసితుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com