Nara Lokesh : జగన్‌, మంత్రులు మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరు..!

Nara Lokesh : జగన్‌, మంత్రులు మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరు..!
Nara Lokesh : ప్రభుత్వాధినేతగా ప్రజా రాజధానిపై జగన్‌ చేస్తున్న విద్వేషపు కుట్రలపై.. అమరావతి రైతులు, కూలీలు జరుపుతున్న పోరాటం 700 రోజులకు చేరిందన్నారు నారా లోకేష్.

Nara Lokesh : ప్రభుత్వాధినేతగా ప్రజా రాజధానిపై జగన్‌ చేస్తున్న విద్వేషపు కుట్రలపై.. అమరావతి రైతులు, కూలీలు జరుపుతున్న పోరాటం 700 రోజులకు చేరిందన్నారు నారా లోకేష్. రాజధాని సమస్య 30 వేల మంది రైతుల సమస్య అంటూ చిన్న చూపు చూశారని, అలాంటి పాలకుల కళ్లు బైర్లు కమ్మేలా కోట్లాది రాష్ట్ర ప్రజలు రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచారని అన్నారు. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర జనసంద్రాన్ని తలపిస్తోందన్నారు నారా లోకేష్. జగన్‌, ఆయన మంత్రులు మరో మూడు జన్మలు ఎత్తినా మూడు రాజధానులు కట్టలేరని, రాజధాని కోసం భూములు, ప్రాణాలిచ్చిన వారి త్యాగం నిరుపయోగం కాదని అన్నారు. అమరావతి కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్ష అని, అమరావతి వైపే న్యాయం కూడా ఉందన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అమరావతి రైతులకు ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు ఉందన్నారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story