Nellore : రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు

Nellore : రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు
ఈ ఘటనలో పోలీస్‌ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యారు


నెల్లూరుజిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్‌ సిబ్బందిపైకి కారుతో దూసుకుపోయారు. రాపూరు అడువుల నుంచి కారులో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు కొందరు స్మగ్లర్లు. సమాచారం అందుకున్న స్థానిక రాపూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై అతని సిబ్బంది కారు వెంబడించారు. అయితే వారిపైకి స్లగ్లర్లు వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయారు. ఈ ఘటనలో పోలీస్‌ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఎర్రచందన స్మగ్లర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story