AP New Liquor Policy : ఏపీలో అమలులోకి కొత్త మద్యం పాలసీ

AP New Liquor Policy : ఏపీలో అమలులోకి కొత్త మద్యం పాలసీ
X

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభమయ్యాయి. దీంతో నేటి నుంచి మందు బాబులు కోరుకునే అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రతి షాపు నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం లైసెన్సులు దక్కించుకున్నవారు APSBCL కు ఆర్డర్లు పెట్టారు. ఈ మద్యం విలువ దాదాపు 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

దేశవ్యాప్తంగా లభించే అన్ని బ్రాండ్ల వారం రోజుల్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే 99 రూపాయలకే క్వార్టర్‌ మద్యం విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మద్యం కూడా రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ పాలసీ అమలులో ధరల సవరణకు కేబినెట్ ఆమోదం కావాలి.. అలాగే కొన్ని మద్యం కంపెనీలు రూ.99కే క్వార్టర్ మద్యం అందించేందుకు ఒప్పుకోగా.. మరికొన్ని కంపెనీలు ఆమోదం తెలపాల్సి ఉంది. అందుకే రెండు, మూడు రోజుల్లో రూ.99కే మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ప్రభుత్వం మద్యం విక్రమాలపై కొత్తగా డ్రగ్‌ కంట్రోల్‌ సెస్‌ విధించింది. ల్యాండెడ్‌ కాస్ట్‌పై సెస్ 2 శాతం మేర వేయనుంది. దీనిద్వారా ఏడాదికి 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సెస్ ద్వారా వచ్చే డబ్బుల్ని డ్రగ్స్, గంజాయి, ఇతర వ్యసనాల నుంచి విముక్తి.. కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం వెచ్చిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మద్యం షాపులో డిజిటల్ పేమెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

Tags

Next Story