Andhra Pradesh: ఆందోళనలు, ధర్నాలు, సమ్మెలతో ఏమీ రాదు- ఏపీ సీఎస్

X
By - Divya Reddy |3 Feb 2022 8:28 PM IST
Andhra Pradesh: చర్చిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు.
Andhra Pradesh: ఆందోళనలు, ధర్నాలు, సమ్మెలతో ఏమీ రాదని.. చర్చిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. ఎక్కడ జీతం తగ్గిందో చెబితేనే కదా తెలిసేదనని పేర్కొన్నారు. రెండున్నరేళ్లుగా మధ్యంతర భృతి ఇస్తున్నామన్నారు. తెలంగాణలా తాము కూడా అప్పట్లోనే డీఏ ఇస్తే ప్రభుత్వానికి 10 వేల కోట్లు మిగిలేదని అన్నారు. తెలంగాణలా తాము డీఏ ఇవ్వలేదని, ఐఆర్ ఇచ్చామని పేర్కొన్నారు. ఉద్యోగులకు సమస్యలున్న మాట నిజమని, చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com