ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
రాష్ట్రంలో దేవుడి విగ్రహాల తరువాత.. రాజకీయ నాయకుల విగ్రహాలనే టార్గెట్ చేస్తారని ప్రభుత్వం ముందే హెచ్చరించింది.

ఎన్టీఆర్, అంబేద్కర్, వంగవీటి విగ్రహాలే టార్గెట్‌గా త్వరలో దాడులు జరుగుతున్నాయన్న ప్రభుత్వ హెచ్చరికలు అమలవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కావాలనే ఈ దాడి జరిగి ఉంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో దేవుడి విగ్రహాల తరువాత.. రాజకీయ నాయకుల విగ్రహాలనే టార్గెట్ చేస్తారని ప్రభుత్వం ముందే హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలోనే విగ్రహాల ధ్వంసం ఉంటుందని స్వయంగా వైసీపీ నేత సజ్జల మీడియా ముందుకొచ్చి చెప్పారు. ఇప్పుడా మాటలే నిజమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

ఇంటెలిజెన్స్‌ నుంచి సమాచారం ఉన్పప్పుడు ప్రభుత్వం ఎందుకు అప్రమత్తంగా లేదనే ప్రశ్న తలెత్తుతోంది. విగ్రహాల ధ్వంసం ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించబోతున్నారని ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉంది. అలాంటప్పుడు.. అదే ఇంటెలిజెన్స్ ద్వారా దుండగులను ఎందుకు పట్టుకోలేకపోయారని పలువురు విమర్శిస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసేంత వరకు చూడడం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story