వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఫైర్

జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్ధకు కట్టబెట్టడంపై మండిపడ్డారు. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆయన.. హెల్త్ ఎమర్జెన్సీని వదిలి అమూల్ సంస్థపై చర్చించడమేంటని ప్రశ్నించారు. ఏపీ డెయిరీ ఆస్తులు కారుచౌకంగా అమూల్కు కట్టబెట్టడంలో ప్రభుత్వం కుట్ర ఉందని పట్టాభి ఆరోపించారు.
ఏపీలో కరోనా విజృంభిస్తున్నా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పట్టాభి ఆరోపించారు. అధికారిక లెక్కలు, వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. రాష్ట్రంలో భయాందోళన పరిస్ధితులు ఉంటే.. కేబినెట్ ఎజెండాలో కరోనాను చిట్టచివరి అంశంగా చర్చించడమేంటని ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోతున్నా జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని పట్టాభి ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com